హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసేందుకు చేపట్టిన గ్రోత్ మానిటరింగ్ సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ విధానం వల్ల చిన్నారుల ఎదుగుదలలో గణనీయ మార్పులు వస్తున్నట్టు శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ కుటుంబ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)-2019-20 రికార్డుల ఆధారంగా అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణతో ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్యం ఎంతో మెరుగుపడినట్టు స్పష్టమవుతున్నది. ఎదుగుదల లేకుండా కురచగా ఉన్న (స్టంటింగ్), గిడసబారిన చిన్నారులతోపాటు బక్కపలచగా (వెస్టింగ్), బరువు తక్కువగా ఉన్న పిల్లల ఆరోగ్యం గణనీయంగా మెరుగైనట్టు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను ప్రతి నెలా రికార్డు చేస్తున్నారు. నెలవారీగా చిన్నారుల ఎదుగుదల ఎలా ఉన్నది?, బలవర్ధకమైన పౌష్ఠికాహారాన్ని అందించడం వల్ల ఏ స్థాయిలో మార్పు వచ్చింది? అనే అంశాలను బేరీజువేసి తదనుగుణమైన కార్యాచరణను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. దీంతో పిల్లల ఎదుగుదలలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తున్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
గ్రోత్ మానిటరింగ్తో చిన్నారుల ఆరోగ్యంలో మెరుగుదల
క్యాటగిరీ ఎన్ఎఫ్హెచ్ఎస్ మార్పు
తక్కువ బరువు (అండర్వెయిట్) 31.5% 11.5%
వెస్టింగ్ (బక్కబలచదనం) 21.7% 8.5%
కురచదనం (స్టంటింగ్) 31.1% 22.7%