న్యూఢిల్లీ: మాస్కో వేదికగా జరిగిన వుషు చాంపియన్షిప్లో భారత్కు చెందిన సాదియా తారిఖ్ స్వర్ణ పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో లోకల్ ఫెవరేట్ ప్లేయర్పై సాదియా అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి తనదైన దూకుడు కనబర్చిన సాదియా.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా పతకం సొంతం చేసుకుంది. శ్రీనగర్కు చెందిన ఈ 15 ఏండ్ల యువ ప్లేయర్ ఇటీవల జలంధర్లో జరిగిన 20వ జాతీయ జూనియర్ చాంపియన్షిప్లోనూ పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. మాస్కో టోర్నీలో సత్తాచాటిన సాదియాను ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందించారు.