ఇది ఓ సరస్వతి పుత్రిక దీనగాథ.. ఆమె చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నాన్నేమో.. కనికరం లేకుండా అమ్మమ్మ ఇంట్లో వదిలేశాడు. అమ్మమ్మ ఏ మాత్రం విసిగించుకోకుండా.. ఆమెను చేరదీసింది. ఆ బాలిక కూడా అమ్మ లేదు కదా అని కుంగిపోలేదు.. నాన్న చేరదీయడం లేదు కదా అని బాధ పడలేదు. అమ్మమ్మ కష్టాన్ని వృధా చేయకుండా.. ఆమె చదువుల తల్లిగా మారింది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో 99.4 శాతం మార్కులు సాధించి, అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఆ సరస్వతి పుత్రిక దీనగాథను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వెలుగులోకి తెచ్చారు. టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీజ, ఆమె అమ్మమ్మను ఇంటర్వ్యూ చేసిన క్లిప్ను వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో శ్రీజకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందిస్తున్నారు. ఉన్నత చదువులు గొప్పస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.
శ్రీజ 99.4 శాతం మార్కులు సాధించడంపై ఆమె అమ్మమ్మ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీజ రిజల్ట్స్ ఎంతో సంతృప్తిని ఇచ్చాయన్నారు. ఆమెను అల్లుడి గురించి అడిగినప్పుడు.. తన కూతురు చనిపోయిన తర్వాత.. శ్రీజను తన వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తాము ఆయనను చూడలేదు. ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. శ్రీజ రిజల్ట్స్తోనైనా ఆయన పశ్చాత్తప పడి.. తన నిర్ణయం మార్చుకుంటాడని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక శ్రీజ పాట్నాలోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదివింది. సంస్కృతం, సైన్స్ సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించింది. ఇంగ్లీష్, మ్యాథమేటిక్స్, సోషల్ స్టడీస్లో 99 మార్కులు సాధించింది.
ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది. పుస్తకాలు చదవడం అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్కు కూడా సమయాన్ని కేటాయిస్తానని తెలిపింది. ఎగ్జామ్స్ కంటే ముందు చాలా ప్రశ్నాపత్రాలకు సమాధానాలు రాయడంతో పాటు వాటిని రివిజన్ చేసుకున్నానని శ్రీజ పేర్కొన్నది.
त्याग और समर्पण की अद्भुत दास्ताँ!
माँ का साया हटने पर पिता ने जिस बेटी का साथ छोड़ दिया उसने नाना-नानी के घर परिश्रम की पराकाष्ठा कर इतिहास रच दिया।
बिटिया का 10वी में 99.4% अंक लाना बताता है कि प्रतिभा अवसरों की मोहताज नहीं है।
मैं आपके किसी भी काम आ सकूँ, मेरा सौभाग्य होगा। pic.twitter.com/ufc3Gp4At9
— Varun Gandhi (@varungandhi80) July 24, 2022