న్యూఢిల్లీ : కేంద్రంలో మత్స్యశాఖ లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మత్స్యశాఖ లేదని రాహుల్ చేసిన ప్రకటన ఆయన జ్ఞాపక శక్తి కోల్పోయారా అనే సందేహాలను లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 2న పార్లమెంట్లో మత్స్యశాఖకు సంబంధించి ప్రశ్నించిన రాహుల్ ఆపై పుదుచ్చేరి, కొచ్చిలో మాట్లాడిన మాటలు విస్మయం కలిగించాయని అన్నారు.
ఆయా సభల్లో రాహుల్ మట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేస్తామని రాహుల్ పేర్కొన్నారని మంత్రి ఆక్షేపించారు. మరి మత్స్యశాఖ లేకుంటే పార్లమెంట్లో సంబంధిత అంశంపై తనను ప్రశ్నించింది ఎవరని రాహుల్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఏయే శాఖలు, మంత్రిత్వ శాఖలు ఉన్నాయనేది తెలుసుకునేందుకు రాహుల్ను స్కూల్కు పంపాలని లోక్సభలో మాట్లాడుతూ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఇటలీలో ప్రత్యేకంగా మత్స్యశాఖ లేదని, అక్కడ వ్యవసాయం, అటవీ మంత్రిత్వ శాఖల్లో భాగంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.