ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 25: భార్యాభర్తలు గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ భర్త జీహెచ్ఎంసీ ఉద్యోగి కావడం విశేషం. ఈ ఘటన లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్త్ లాలాగూడ శాంతినగర్లో నివాసముండే ఉమెర్ ఖాన్ (31), ఫర్జానా బేగంకు పదకొండేళ్ల క్రితం వివాహమైంది. ఉమెర్ ఖాన్ బాబానగర్లోని జీహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వారికి ముగ్గురు సంతానం. ఈ నెల 20న ఇద్దరూ గొడవపడగా ఫర్జానాబేగం సోదరుడు వాళ్ల ఇంటికి రావడంతో ఆమె పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి 22న, 23న వచ్చి చూడగా ఇంటికి తాళం వేసే ఉంది. తన భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.అతడి కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడి భార్య బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.