బంజారాహిల్స్, నవంబర్ 25 : రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.2లోని జవహర్ కాలనీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జోనల్ కమిషనర్ రవికిరణ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జవహర్కాలనీలో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ తీసుకున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ తీసుకోనివారి వివరాలు సేకరించి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నగరంలోని మురికివాడల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని జవహర్కాలనీలో కేంద్రమంత్రి పర్యటించే అవకాశం ఉండటంతో ముందస్తుగా జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటించినట్లు సమాచారం. ఈ పర్యటనలో డీఎంసీ సేవా నాయక్, ఏఎంఓహెచ్ డా.రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.