బన్సీలాల్పేట్, నవంబర్ 23 : న్యూబోయిగూడలోని రెండు పార్కులను అభివృద్ధి చేసేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ. 16 లక్షలను మంజూరు చేశారని బన్సీలాల్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు తెలిపారు. కార్పొరేటర్ హేమలత అభ్యర్థన మేరకు చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న రెండు పార్కులను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి నిధులను కేటాయించారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజినీర్ రవీందర్ తన సిబ్బందితో కలిసి రెండు పార్కులను పరిశీలించారు. రోజు వచ్చే వారికోసం వాకింగ్ ట్రాక్, ప్రహరీ నిర్మాణం, పచ్చదనం పెంపు పనులను చేపట్టనున్నామని తెలిపారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు లంక రాజు, అర్జున్, శ్రీను పాల్గొన్నారు.