‘సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని నేను విశ్వసిస్తా. నా సినిమాల ద్వారా సమాజానికి, ప్రేక్షకులకు మంచి విషయాన్ని చెప్పాననే సంతృప్తి దర్శకుడిగా నాకు దక్కాలని కోరుకుంటా’ అని అన్నారు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’.సంతోష్శోభన్, మెహరీన్ జంటగా నటించారు. వి.సెల్యూలాయిడ్తో కలిసి స్కేఎన్ నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో మారుతి
పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
మధ్యతరగతి కుటుంబాల వారిలో చాలా భయాలు కనిపిస్తుంటాయి. ఇదివరకు ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుందని భావించేవారు. కానీ ఇప్పుడు మంచి అల్లుడిని వెతుక్కునే క్రమంలో కొన్ని విషయాల్లో రాజీపడుతున్నారు.అలాంటి ఆలోచనలు కలిగిన అతి భయస్తుడైన ఓ అమ్మాయి తండ్రి కథ ఇది. ప్రేమ పేరుతో అమ్మాయి ఎక్కడ మోసపోతుందోనని అనుక్షణం సంశయంలో బతుకుతుంటాడు. అతి భయాలు అతడి జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపాయన్నది నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. కరోనా అనేది సినిమాలో చిన్న ఎలిమెంట్గానే ఉంటుంది. అదే ప్రధాన కథాంశం కాదు. భయమే అన్నింటికంటే పెద్ద రోగం. వ్యాధి పది రోజులు బాధపెడితే భయం మాత్రం ఏడాది మొత్తం మనిషిని క్రుంగిపోయేలా చేస్తుందని సినిమాలో చూపించాం.
ఆ రిస్క్ నేనే తీసుకుంటా
దర్శకుడిగా నా బలం కామెడీనే. కథ ఎలాంటిదైనా దానిని వినోదాత్మకపంథాలోనే చెప్పడానికి నేను ఇష్టపడతా. నేను కామెడీని బాగా పండించగలనని నిర్మాతలు నమ్ముతున్నారు. నవ్విస్తాననే నమ్మకంతో నా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్కు వస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకుండా జాగ్రత్తపడతా.
లక్ష్యాలన్నీ నెరవేరాయి
లాక్డౌన్ విరామంలో తక్కువ బడ్జెట్తో 25 రోజుల్లోఈసినిమాను పూర్తిచేశాం. ఓటీటీ మాధ్యమాల వల్ల కొత్త దర్శకులకుఅవకాశాలు పెరిగాయి. ఇదివరకు దర్శకులు థియేటర్స్కు వచ్చే ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా సినిమాలు చేసేవారు.ఓటీటీల వల్ల కొత్త ఆలోచనలతో మనసుకు నచ్చిన చిత్రాల్ని తెరకెక్కించే అవకాశం దొరుకుతుంది. కథాంశాల పరంగా ఉన్న పరిమితులు తొలగిపోయాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నా. ఇటీవల ఆయన్ని కలిసి కథ చెప్పా. చిరంజీవికి నచ్చింది. కథను పూర్తిస్థాయిలో డెవలప్చేసే పనిలో ఉన్నా. నా శైలి హంగులతో పాటు చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలుంటాయి. గోపీచంద్తో చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ నెలలోనే తిరిగి చిత్రీకరణను మొదలుపెట్టనున్నాం. కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.