ముంబై: భారత్ కేవలం మూడు వ్యాక్సిన్లను మాత్రమే అనుమతించిందని, ఆ జాబితాలో లేని మోడర్నా వ్యాక్సిన్ను ఫ్రాన్స్ రాయబార కార్యాలయం దేశంలోకి ఎలా తెప్పించగలిగిందని, ఇండియాలోని తన పౌరులకు ఎలా ఇవ్వగలుగుతున్నదని మహారాష్ట్ర మైనాైరిటీ వ్యవహరాల మంత్రి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. అనుమతించని వ్యాక్సిన్ను కేంద్రం దేశంలోకి ఎలా రానిచ్చిందని విస్మయం వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటివరకు కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్-5 వ్యాక్సిన్లను మాత్రమే అనుమతించింది. ఇదిలాఉంటే ప్రెంచ్ ఎంబసీ మోడర్నా టీకాను తెప్పించి నమీ ముంబైలోని అపోలో హాస్పిటల్స్ ద్వారా తన పౌరులకు ఇప్పిస్తిున్నదని మంత్రి తెలిపారు. “వారు తెప్పించుకుంటున్నప్పుడు మనం ఎందుకు తెప్పించకూడదు. మన పౌరులకు ఎందుకు ఇప్పించకూడదు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష్ వర్ధన్ దీనిపై స్పష్టీకరణ ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ స్పందిస్తూ ఇలాంటి విషయాల మీద సమయం వృధా చేసే బదులు మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రజలను పట్టించుకుంటే బాగుంటుందని దుయ్యబట్టారు.