హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ వినూత్న ఆఫర్లతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే శుభకార్యాలకు బస్సులు కిరాయికి ఇస్తుండగా.. తాజాగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు మరో కొత్తఆఫర్ను ప్రకటించింది. తక్కువ చార్జీలకు స్పెషల్ బస్సులను కిరాయికి ఇవ్వడంతోపాటు ప్రతీ బస్సులో ఇద్దరు వంట మనుషులు, పదేండ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్కు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు తెలిపింది. 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుకు కిలో మీటర్కు రూ. 48.96, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.47.20, 48 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.56.64, 49 సీట్ల ఎక్స్ప్రెస్ బస్సుకు కిలో మీటర్కు రూ. 52.43 చార్జీ నిర్ణయించింది. బస్సులు కావాల్సిన భక్తులు దగ్గరలోని బస్స్టేషన్లలో సంప్రదించాలని సూచించింది.