రోజూ ఉదయం మనం తప్పకుండా చేసే పని పళ్లు తోముకోవడం. అయితే, ఎంతసేపు తోముకున్నామన్నదీ ముఖ్యమేనని అంటున్నారు దంత వైద్యులు. పళ్లపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి పేరుకుపోయి పాచిలా తయారవుతాయి. పన్నెండు గంటలకోసారి రెండు నిమిషాల పాటు పళ్లు తోముకుంటే, పాచి మొత్తం పోతుందనీ, దంతాల ఆరోగ్యం బాగుంటుందనీ గతంలో నిపుణులు సిఫార్సు చేసేవారు. ఇదంతా పాత మాట. రోజుకు రెండుసార్ల్లు.. కనీసం నాలుగైదు నిమిషాలు తోముకుంటేనే దంత సమస్యలు రాకుండా ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.