లండన్ : యూకే లోక్సభ మాజీ సభ్యుడు, లండన్లోని భారత హైకమిషన్ మాజీ అధికారి తెక్కెమూరి హరిదాస్ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 1 గంటకు చనిపోయినట్లు కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.
కడుపుకు సంబంధించిన వ్యాధితో హరిదాస్ గత కొన్నిరోజులుగా సెయింట్ జార్జ్ దవాఖానలో టూటింగ్ చికిత్స పొందుతున్నారు. కేరళలోని గురువాయూర్కు చెందిన తెక్కెమూరి హరిదాస్.. తన కుటుంబంతో కలిసి లండన్లో నివసిస్తున్నారు. ఆరోగ్య సమస్య తీవ్రమవడంతో ఆయన సోమవారం దవాఖానలో చేరారు.
హైకమిషన్ అధికారిగా ఎంతో సేవచేశారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండేవారు. అతడికి నలుగురు పిల్లలు ఉన్నారు. అర్ధ శతాబ్దంపాటు లండన్లోని భారత హైకమిషన్లో పనిచేసిన హరిదాస్.. బ్రిటిష్ మలయాళీ రాయబారి అయ్యారు.
తెక్కెమూరి హరిదాస్ మరణం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. బ్రిటిష్ వ్యాపారవేత్తగా, భారత హైకమిషన్ మాజీ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, సామాజిక కార్యకర్తగా హరిదాస్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. లోక కేరళ సభలో సభ్యుడిగా ఆయన సేవలు చిరస్మరణీయాలని పినరయి విజయన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ ఆర్-ఫ్యాక్టర్
బెంగాల్ ఎన్నికలకు యూపీ పోలీసులు.. ఈసీకి టీఎంసీ లేఖ
బిట్ కాయిన్తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్ మస్క్ ట్వీట్
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..