విరాజ్ అశ్విన్, ధృషిక చందర్ ప్రధాన పాత్రల్లో నటించిన లఘు చిత్రం ‘మనసానమః’. దీపక్రెడ్డి దర్శకుడు. గజ్జల శిల్ప నిర్మాత. గత ఏడాది విడుదలైన ఈ లఘు చిత్రం ఇప్పటివరకు తొమ్మిదివందలకుపైగా అవార్డులను దక్కించుకున్నది. ఆస్కార్కు క్వాలిఫై అయ్యింది. సోమవారం హైదరాబాద్లో ఈ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే షార్ట్ ఫిలిమ్ ఇది. రివర్స్ స్క్రీన్ప్లే విధానంలో సాగుతుంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ ఉంది. అందులో మేము విజయం సాధిస్తామని అనుకుంటున్నాం’ అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న ఈ షార్ట్ఫిలిమ్లో తాను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని విరాజ్ అశ్విన్ అన్నారు. నటనలో ఎలాంటి అనుభవం లేకపోయినా చాలెంజింగ్గా భావించి ఈ లఘు చిత్రం చేశానని ధృషిక చెప్పింది.