న్యూఢిల్లీ, మార్చి 12: యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఆధ్వర్యంలో నడుస్తున్న వంటనూనెల సంస్థ రుచి సోయా..క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీగా నిధులు సేకరించాలనే ఉద్దేశంతో ఫాల్లో-ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో)కి రాబోతున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు ఎఫ్పీవో ద్వారా గరిష్ఠంగా రూ.4,300 కోట్ల వరకు నిధులు సేకరించేయోచనలో సంస్థ ఉన్నది. ఇందుకు సంబంధించి సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ నిధుల సేకరణకు సంబంధించి ఇప్పటికే సెబీ, బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. గతేడాది జూన్లో సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్హెచ్పీ) సమర్పించిన సంస్థకు అదే ఏడాది ఆగస్టులో అనుమతినిచ్చింది. 2019లో రుచి సోయాను పతంజలి గ్రూపు రూ.4,350 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం సంస్థలో ప్రమోటర్లకు 99 శాతం వాటా ఉండగా..ఈ ఎఫ్పీవో ద్వారా 9 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నది.