హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఏపీ విశ్వవిద్యాలయం ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించిన విద్యార్థులను విజయవాడలోని తాజ్ గేట్వే హోటల్లో జిల్లా కలెక్టర్ జే నివాస్ సమక్షంలో సత్కరించినట్టు వర్సిటీ సోమవారం వెల్లడించింది. దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉన్నదని వర్సిటీ వీసీ వీ కోటారెడ్డి తెలిపారు. అక్టోబర్ 30 నాటికి మొత్తం 535 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్రెడ్డి, కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ విద్యార్థులు, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.