ఖమ్మం : జిల్లాలోని మదిగొండ మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్కు ఓ నకిలీ గ్రాడ్యుయేట్ ఓటు వేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు..ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ముదిగొండలోని జడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఆదివారం సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఓ యువకుడు కేంద్రానికి వచ్చాడు. పోలీసులు ఓటర్ స్లిప్ అడుగగా నకిలీ స్లిప్ చూపించాడు. అనుమానం వచ్చిన సీఐ అంజలి తనదైన శైలిలో విచారించగా తన పేరు సతీశ్కుమార్ అని, తాను 10వ తరగతి మాత్రమే చదువుకుంటున్నట్లు వెల్లడించాడు. గోకినేపల్లికి చెందిన ఓ వ్యక్తి తనను ఓటు వేయమని చెప్పాడని సదరు యువకుడు తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.