జనరల్ రావత్ హెలికాప్టర్ ప్రమాద స్థలాన్ని చూసిన మొదటి ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి అక్కడ నెలకొన్న గగుర్పాటు దృశ్యాలను కండ్లకు కట్టినట్టు వివరించారు. ‘ప్రమాదం జరిగిన స్థలం దగ్గర్లోనే నేనున్నా. ఇంతలో హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి శబ్దం విన్న ప్రాంతం వైపునకు నడిచా. అక్కడికి వెళ్లి చూడగా.. ఓ హెలికాప్టర్ పెద్ద చెట్టుమీద పడి ఉంది. ఇంతలో మంటలు రేగాయి. మంటల్లో ఉన్న హెలికాప్టర్ నుంచి కాలిపోతున్న మృతదేహాలు కిందకు పడుతున్నాయి. ఏం జరుగుతుందో కొంతసేపు వరకు అర్థంకాలేదు. ప్రమాదం గురించి సమీపంలోని వారికి, అనంతరం అధికారులకు తెలియజేశా’ అని కృష్ణస్వామి చెప్పారు.