హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
కరోనా లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని అన్నారు. వైరస్ బారినపడిన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి