హైదరాబాద్ : అందరూ అభినందించే విధంగా జాతి రత్నాలు సినిమా తీశారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నెక్లెస్ రోడ్డులో గురువారం రాత్రి జరిగిన జాతి రత్నాలు సినిమా సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనకు అశ్వనీ దత్ కుటుంబంతో 35 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లతో భారీ బడ్జెట్లతో సినిమాలు తీసిన చరిత్ర అశ్వనీ దత్ సొంతమన్నారు.
అలాంటి అశ్వనీ దత్ బిడ్డ-అల్లుడు కలిసి స్వప్న బ్యానర్ పై తీసిన సినిమా జాతి రత్నాలు అన్నారు. అందరి మన్ననలు పొందేలా జాతి రత్నాలు సినిమా తీశారని మంత్రి ప్రశంసించారు. కె.వి.అనుదీప్ దర్శకుడిగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తీశారు. వినోదంతో ఘన విజయం సాధించారని మంత్రి చిత్ర యూనిట్ ని అభినందించారు.