న్యూఢిల్లీ: కేంద్ర గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సూళ్లలో (ఈఎంఆర్ఎస్) టీచర్ పోస్టుల దరఖాస్తుకు సంబంధించిన గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఆసక్తికలిగివారు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి ఈ పాఠశాలలు నెలకొల్పారు. ఈ పాఠశాలల్లో 3400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. మొత్తం 160 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి 40 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూ లేదని, రాతపరీక్ష 180 మార్కులకు ఉంటుందని వెల్లడించింది.