ఒరేగాన్: అమెరికాలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్ ఫైనల్లోకి ఎల్డోజ్ పౌల్ అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో అతను 16.68 మీటర్ల దూరం దూకాడు. ఆ రౌండ్లో అతను 12వ స్థానంలో నిలిచాడు. వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో భారతీయ అథ్లెట్ ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఎల్డోజ్ పౌల్ తన తొలి ప్రయత్నంలో 16.12 మీటర్ల దూరం దూకాడు. ఆ తర్వాత తన జంప్ను ఇంప్రూవ్ చేసి 16.68 మీటర్ల దూరం దూకాడు. ట్రిపుల్ జంప్ ఈవెంట్లో పాల్గొన్న ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబాకర్లు క్వాలిఫయింగ్ రౌండ్లో విఫలం అయ్యారు. ఎల్డోజ్ పౌల్ కన్నా పర్సనల్ బెస్ట్ ఉన్న ఆ ఇద్దరూ సరైన సమయంలో రాణించలేకపోయారు.
Historical morning for #IndianAthletics🇮🇳 at @WCHoregon22
✅️#EldhosePaul becomes the 1st Indian to reach Men's Triple Jump Final with a jump of 16.68m; finishing 12th (Q)
✅️@RohitJavelin joins @Neeraj_chopra1 in Javelin Final with a throw of 80.42m; finishing 11th (Q)
1/1 pic.twitter.com/JmHbbUE8HP
— SAI Media (@Media_SAI) July 22, 2022