హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ)తో మ్యాపింగ్ చేయిస్తున్నది. స్కూళ్ల రూపురేఖలను మార్చేందుకు ఏటా రూ.2 వేల కోట్లతో త్వరలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయనున్నది. దీనిపై డ్రాఫ్ట్ తయారుచేసిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇటీవలే ఈ అంశంపై సమీక్షించిన సీఎం కేసీఆర్ విద్యాసంస్థల మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఎస్ఏ ద్వారా గ్రామాలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకు అన్ని రకాల యాజమాన్యాల పాఠశాలలను మ్యాపింగ్ చేయిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
కాలేజీలు సైతం..
స్కూళ్ల తరహాలోనే కాలేజీలను సైతం మ్యాపింగ్ చేసేందుకు కళాశాల విద్య అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్ ఉపకరణాలను వినియోగించి యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ, వృత్తి విద్యాకాలేజీల మ్యాపింగ్కు యోచిస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలను సైతం ఇదే తరహాలో క్రోడీకరించాలని భావిస్తున్నారు.
పాఠశాలల మ్యాపింగ్ ద్వారా కలిగే లాభాలు