హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని రైతు స్వరాజ్య వేదిక ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ రూపొందించిన కరువు మాన్యువల్ ప్రకారం రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధతతో కూడిన రైతు కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు.