కేపీహెచ్బీ కాలనీ, మార్చి 18 : వాహనాలతో రాంగ్ రూట్లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ తెలిపారు. గురువారం రాత్రి జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫి క్ కొత్త నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు రాంగ్రూట్లో వెళ్తే రూ. 1100 జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయ డం జరుగుతుందన్నారు. మద్యంతాగి వాహనాలను నడిపితే జరిమానా, జైలు శిక్షతో పాటు ఆరు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, రెండోసారి పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడం ప్రమదకరమన్నారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపిన వారిపై కేసులు నమోదు చేయకుండా హెల్మెట్ను కొనుగోలు చేయిస్తామన్నారు. రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలను నడిపితే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ అన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబడిన 24మందికి జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 24మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరిని అదుపులోకి తీసుకుని అందరికి కలిపి రూ. 79వేల జరిమానా విధించినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్లను రద్దు చేయాలని కోరుతూ ఆర్టీవో కార్యాలయానికి నివేదికను అందించినట్లు తెలిపారు.
బాలానగర్ : బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫి క్ పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం ట్రాఫిక్ సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ట్రాఫిక్ సీఐ వెంకటయ్య మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా తమ ద్విచక్ర వాహనాలకు పెండిం గ్ చలానాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఒక వేళ తమతమ వాహనాలకు పెండింగ్ చలానలు ఉంటే వాటిని మీసేవ సెంటర్లకు వెళ్లి చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందు వల్లనే ఫొటోలు తీసి చలానలు పంపించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ చలానలు.. రాంగ్ రూట్ డ్రైవింగ్ రూ. 1100, ట్రిపుల్ రైడింగ్ రూ. 1100, ఓవర్స్పీడ్ డ్రైవింగ్ రూ. 1000, హెల్మెట్ లేకుంటే రూ. 140, లైసెన్స్ లేనివారికి రూ. 1100, సిగ్నల్ జంపింగ్ రూ. 1000లు ఉంటాయని జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ చలాన నుంచి బయటపడాలని సూచించారు.