హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వృద్ధ కళాకారుల పింఛన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచిన సీఎం కేసీఆర్కు సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో గురువారం సాంస్కృతికశాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 2,661 మంది వృద్ధ కళాకారులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి పెంచిన పింఛన్ను ఇవ్వనున్నట్టు చెప్పారు. జీవితం మొత్తం కళాప్రదర్శనల్లో గడిపిన వృద్ధ కళాకారులకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.500 పింఛన్ మాత్రమే ఉండేదని, స్వరాష్ట్రంలో 2014 అక్టోబర్ నుంచి రూ.1,500 ఇస్తున్నామని, ఇందు కు ఏటా రూ.4.78 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న సీఎం కేసీఆర్.. వృద్ధ కళాకారుల పింఛన్ కోసం ఇప్పుడు ఏటా రూ.9.62 కోట్లు వెచ్చిస్తున్నట్టు వెల్లడించారు. సమీక్షలో సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.