కరీంనగర్ ముకరంపుర/పాల్వంచ, జూన్ 23 : జెన్కో పరిధిలోని నల్లగొండ జిల్లా వైటీపీఎస్లో గల యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాక్ (టీఈఈ జాక్) ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 5, 6 దశల సీఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్లాంట్లను ప్రైవేట్పరం చేసే యత్నాలపై జేఏసీ నాయకులు, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు కరీంనగర్ సరిల్ కార్యాలయంలో నిరసన తెలిపారు.