నేరేడ్మెట్, నవంబర్ 14 : సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. స్టేషన్ టికెట్ కౌంటర్కు వెళ్లాలన్నా..రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయానికి వెళ్లాలన్నా చెత్తకుప్పలను దాటుకుంటూ వెళ్లాల్సివస్తుంది. అంతేకాకుండా చెత్తా చెదారం ఉండటంతో ప్రజలు అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో భరిం చరాని దుర్వాసన వస్తుందని, అలాగే దోమలు విజృంభిస్తున్నాయని .. తద్వార విష జ్వరాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.