హైదరాబాద్, ఆట ప్రతినిధి: హ్యాండ్బాల్ సంఘం జాతీయ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావుకు విశిష్ట పురస్కారం లభించింది. ఆదివారం ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్.. జగన్మోహన్కు అవార్డును ప్రదానం చేశాయి. దేశంలో మునుపెన్నడూ లేని రీతిలో హ్యాండ్బాల్కు క్రేజ్ తీసుకురావడంతో పాటు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. మాస్టర్ అథ్లెటిక్స్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డితో పాటు విక్రమ్ సింగ్ (జేఎన్యూ, ఢిల్లీ), జార్జ్ అబ్రహం (వైఎంసీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, చెన్నై)కు కూడా నిర్వాహకులు అవార్డులు అందించారు.