సంగీత ప్రపంచంలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్. ఈయన పాడిన ప్రతీ పాట హిట్టే. తాజాగా విడుదలైన నితిన్ రంగ్ దే పాట కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించింది. అలాంటి గొప్ప గాయకుడికి ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం 10లో ఉన్న ఓ ప్రముఖ పబ్కు సిద్ శ్రీరామ్ వచ్చాడు. కొన్ని రోజుల కింద ఓ ఈవెంట్ కోసం వచ్చిన సిద్.. అక్కడ కార్యక్రమం అనంతరం చాలా మంది ప్రముఖులతో కలిసి పబ్ కు వచ్చాడు. అక్కడ ఆయనకు అవమానం జరిగిందని తెలుస్తోంది.
మద్యం మత్తులో ఉన్న కొందరు ఆకతాయీలు సిద్ శ్రీరామ్పై నీళ్లు, మద్యం విసిరి అవమానించారు. వాళ్లను వెంటనే గెట్ అవుట్ అంటూ సిద్ శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడున్న పబ్ యాజమాన్యం జోక్యం చేసుకుని గొడవను ఆపేసారని తెలిసింది. ఆ సంఘటన జరిగిన సమయంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటంతో విషయం పోలీసుల వరకు వెళ్లకుండా అడ్డకున్నారని.. అక్కడితో కాంప్రమైజ్ చేసారని ప్రచారం జరుగుతోంది. తనకు ఎదురైన ఈ అనుకోని సంఘటనతో సిద్ చాలా ఫీల్ అయ్యాడు. అందుకే తన ట్విట్టర్లో క్రమశిక్షణ గురించి ఓ పోస్ట్ చేసాడు. అన్నింటికంటే క్రమశిక్షణ అనేది ముఖ్యమంటూ ఈయన ట్వీట్ చేసాడు. అది ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు సిద్.