హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): శరీరాన్ని కొంచె కొంచెంగా తినేస్తూ, తెలియకుండా మనిషిని చావువైపు తీసుకెళ్లే ఆరోగ్య సమస్య మధుమేహం. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారినీ చక్కెర వ్యాధి ఇప్పుడు వేధిస్తున్నది. మన దేశంలో డయాబెటిక్ రోగులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు 50 ఏండ్లు దాటినవారిలోనే కనిపించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 25-30 ఏండ్లలోపే దాపురిస్తున్నది. తాజాగా నిర్వహించిన నేషనల్ ఫ్యామిటీ హెల్త్ సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్)లో దేశంలో మధుమేహం విస్తరణపై విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
సర్వేలోని ముఖ్యాంశాలు
జీవనశైలి మార్పుతో అదుపు చేయొచ్చు
సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే షుగర్ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాలి. 160-180 మధ్య కౌంట్ ఉంటే ప్రీ-డయాబెటిక్గా స్టేజ్గా పరిగణిస్తారు. వీరు ఆరోగ్య నియమాలు కచ్చితంగా పాటిస్తే సరిపోతుంది. టైప్-1 డయాబెటిస్ జన్యుపరంగా వస్తుంది. వీరు 5 శాతం మందే ఉన్నారు. మిగిలిన 95% మందిలో షుగర్ వ్యాధి వారి జీవనశైలి మార్పులవల్ల వస్తున్నది. వ్యాధిని ముందే గుర్తించి ఔషధాలు వాడుతూనే జీవనశైలిని క్రమబద్ధం చేసుకొంటే మధుమేహాన్ని అదుపుచేయవచ్చు.