న్యూఢిల్లీ: కొండచరియలు విరిగిపడి ఏటా దేశంలో వందలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు, బాధితులు భారత్లోనే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొండ చరియలు పడే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే అత్యంత చవకైన వ్యవస్థను ఐఐటీ-మండి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రమాదాన్ని గుర్తించడంతో పాటు ఆ విషయాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా అధికారులకు అప్రమత్తం చేసేలా తాము ఈ డివైజ్ను రూపొందించామని అసోసియేట్ ప్రొఫెసర్ వరుణ్ దత్ తెలిపారు. వాతావరణ మార్పులు, మట్టిలో తేమలో మార్పులు, నేల కదలికలను అంచనా వేస్తూ ఈ డివైజ్ అలర్ట్ మెసేజ్లను పంపిస్తుందన్నారు.