మోరదాబాద్: చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతికాడు. ఈ ఘటన యూపీలోని మోరదాబాద్లో చోటుచేసుకుంది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న శ్రీకేశ్ కుమార్ను గురువారం రాత్రి ఓ ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. అతన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించి మరణించినట్టు ధ్రువీకరించారు. అతని మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచారు. పంచనామ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడానికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో శ్రీకేశ్ కుమార్ మృతదేహంలో కదలికలను అతని వదిన గుర్తించారు. అతన్ని ఫ్రీజర్లో ఉంచి అప్పటికే 7 గంటలు దాటింది. వెంటనే డాక్టర్లు శ్రీకేశ్కు చికిత్స అందించగా బతికి బయటపడ్డాడు.