కథానాయిక పూర్ణ నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’. జి.ఆర్.ఆదిత్య దర్శకుడు. సురేష్రెడ్డి కొవ్వూరి నిర్మాత. ఈనెల13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. వారిమధ్య ఉండే సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.
అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ట్విస్ట్ కూడా ఈ కథలో ఉంటుంది. రెండుగంటల పాటు ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్ని అందించే సినిమా ఇది’ అని తెలిపారు. త్రిగుణ్, విద్యార్థ్, సుభాశ్రీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ముత్తుకుమార్, సంగీతం: మిస్కిన్, సమర్పణ: పటోళ్ల వెంకట్రెడ్డి, నిర్మాణం: పి19 స్టూడియోస్.