న్యూఢిల్లీ, జూన్18: సైబర్ మోసం కేసులో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేశ్ గుజ్రాల్ రూ.7.80 కోట్లు మోసపోయారు. జూన్ 16న జాతీయ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ ఘటనపై ఫిర్యాదు నమోదైంది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. గుజ్రాల్ మోసపోయిన మొత్తం లో రూ.4 కోట్లను స్తంభింపజేశారు.
గుజ్రాల్ దక్షిణ ఢిల్లీలో వస్ర్తాలు, తోలు, దుస్తుల వ్యాపారానికి సంబంధించి ఒక సంస్థను నడుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు గుజ్రాల్ వాట్సా ప్ నంబర్ను హ్యాక్ చేశారు. దీంతో ఆయనలా అనుకరిస్తూ నరేశ్ గుజ్రాల్ నడుపుతున్న సంస్థ ఆర్థిక విభాగం సభ్యుడితో నేరగాళ్లు మాట్లాడారు. ఐదు రోజుల వ్యవధిలో రూ.7.80 కోట్లను సంస్థ బ్యాంక్ ఖాతాల నుంచి నేరగాళ్లు కొట్టేశారు. ఈ డబ్బు నాలుగు బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ కాగా, వాటిని దర్యాప్తు అధికారులు గుర్తించారు.