చర్లపల్లి, నవంబర్ 24 : బ్యూటీ పార్లర్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వహకుడిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో నివాసముండే మాడిపల్లి మహేశ్(24) కొంత కాలంగా గ్లోయిస్ బ్యూటీ కేర్ పేరుతో యువతులతో క్రాస్ మసాజ్ చేస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు మసాజ్ కేంద్రంపై దాడి చేసి నిర్వాహకుడు మహేశ్తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.