UP 1st Phase Polling | ఈ నెల 10న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 11 జిల్లాల్లో పోలింగ్ జరుగనున్న 58 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో నాలుగో వంతు మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వివిధ పార్టీల అభ్యర్థుల్లో 156 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక 15 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. 8వ తరగతి వరకు చదివిన వారు 125 మంది ఉంటారు. మొత్తం అభ్యర్థుల్లో 70 మంది 60 ఏండ్లు దాటిన వృద్ధులని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) శనివారం తెలిపింది. తొలిదశలో పోటీలో ఉన్న 623 మంది అభ్యర్థులు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది.
మిగతా 8 మంది అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ కాలేదని తెలిపింది. ఇక పదో తరగతి పాసైన వారు 10 మంది ఉంటే, 38 మంది అక్షర జ్ఞానం ఉంది. 65 మంది పదవ తరగతి వరకు, 102 మంది 12వ తరగతి వరకు చదివారు. 100 మంది డిగ్రీ, 78 మంది గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్, 108 మంది పీజీ పూర్తి చేశారు.
18 మంది డాక్టరేట్ పొందగా, ఏడుగురు డిప్లమా కోర్సులు చదివారు. 5-12 తరగతుల మధ్య చదివిన వారు 239 మంది, 304 మంది గ్రాడ్యుయేషన్, ఆ పై ఉన్నత చదువులు అభ్యసించారు. 214 మంది 40 ఏండ్లలోపు వయస్సు గలవారు ఉన్నారు. 60 ఏండ్ల లోపు వారు 328 మంది, 80 ఏండ్లలోపు వారు 73 మంది పోటీ చేస్తున్నారు.