ఆమనగల్లు : మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని 24గంటలు గడవకముందే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. గురువారం ఆమనగల్లు పోలీస్ కార్యాలయ ఆవరణలో మహిళ హత్యకేసు వివరాలను వెల్లడించారు. మాడ్గుల మండలం చంద్రయాన్పల్లి గ్రామానికి చెందిన కొమ్ము పోచమ్మ(38) అనే మహిళ ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్లోని గోషామహల్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. రోజు మాదిరిగానే ఉదయం గోషామహల్కు పనికి వెల్లి తిరిగి అదే రోజు డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఆమనగల్లుకు చేరుకుంది.
కాగా సాకిబండతండాకు చెందిన నేనావత్ జైపాల్నాయక్ అనే వ్యక్తి ఆమనగల్లు పట్టణంలో చికెన్సెంటర్ పెట్టుకొని వ్యాపారం చేస్తుండేవాడు. అయితే ఆమె ఆమనగల్లు ఆటో స్టాండ్ వద్ద వేచి ఉండటాన్ని అతను గమనించి పోచమ్మతో గతంలో పరిచయం ఉండటంతో ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమనగల్లు పట్టణం నుంచి మాలేపల్లి శివారు ప్రదేశానికి తీసుకెల్లి హత్యచారం చేసి కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. ఎవరికి అనుమానం రాకూడదని పోచమ్మ ఆభరణాలు దొంగిలించుకొని అక్కడినుంచి వెల్లిపోయాడు.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా జైపాల్నాయక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. మృతురాలి వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలు కడియాలు, చెవికమ్మలు సెల్ఫోన్ను నేరస్తుడి ఇంటి వద్ద స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. హత్యకేసు విషయంలో 24గంటల్లో కేసును చేదించిన సీఐ ఉపేందర్, ఎసై ధర్మేశ్తో పాటు సిబ్బందిని ఏసీపీ కుషాల్కర్ అభినందించారు.