సుల్తాన్బజార్, డిసెంబర్ 16 : శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ నగరం దేశంలోనే నం.1 స్థానంలో నిలిచిందని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. గురువారం అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను జాయింట్ సీపీ రమేశ్ రెడ్డి, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, జాంబాగ్ కార్పొరేటర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు, దాతల సహకారంతో అఫ్జల్గంజ్ పరిధిలో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మరింత ఎక్కువగా కెమెరాలను ఏర్పాటు చేసేందుకు స్థానిక ప్రజలు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో క్రైమ్ రేట్ అదుపులోకి వచ్చిందన్నారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. గతంలో దొంగను పట్టుకునేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చేదని.. ఇప్పుడు సీసీ కెమెరాలతో కేసులను సులువుగా ఛేదించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ‘నేను సైతం’లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్బజార్, అఫ్జల్గంజ్, చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్లు భిక్షపతి, రవీందర్రెడ్డి, సతీశ్, డీఐలు రామునాయక్, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లింగారెడ్డి, బాలస్వామి, సైదులు, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.