సిటీబ్యూరో, డిసెంబర్ 23 ( నమస్తే తెలంగాణ) : క్రిస్మస్ పండుగొస్తోంది.. ఆపై కొత్త ఏడాది సంబురాలు.. నగరంలో ఇప్పటికే పండుగ వైబ్స్ షురూ అయ్యాయి. కేక్ ఎక్కడ కొనాలి? ఏ స్వీట్ ఏ షాపులో బాగుంటుంది? అరుదైన వెరైటీలు ఏంటీ? ఏ సెలబ్రేషన్కు ఎలాంటి ఫుడ్ ఉండాలి? ఇలాంటి ఆలోచనలతో నగరవాసుల మెదళ్లు నిండిపోయాయి. గూగుల్లో వెతికి అలిసిపోతున్నారు. కస్టమర్ కోరుకున్న రీతుల్లో.. వారికి నచ్చే రుచుల్లో.. హైజీన్ ఆహార ఉత్పత్తులను అందించే ఏకైక డెస్టినేషన్ ఏంటని ఆరా తీస్తున్నారా? మరి నగరంలో అలాంటి సేవలందించే బేకరీ ఉందా అనే ప్రశ్నకు సమాధానం కంట్రీ ఓవెన్. ఔను… పబ్లిసిటీ కోసమో.. లాభాల కోసమో పాకులాడే ప్రస్తుత ట్రెండ్లో 28 ఏండ్లుగా కస్టమర్ నమ్మకమే లాభంగా సరసమైన ధరల్లో అద్భుతమైన రుచుల్లో.. విభిన్న ఆహార ఉత్పత్తులను అందిస్తున్న సంస్థ అది. ఆన్లైన్ సర్వీస్ను తొలిసారిగా దేశానికే పరిచయం చేసిన బేకరీ. కస్టమర్ ఇంటికి ఫుడ్ను అందించే డెలివరీ సేవలను మొదటిసారిగా తీసుకొచ్చిన సంస్థ కూడా ఇదే. ఎలాంటి సెలబ్రేషన్ అయినా అది వందశాతం విజయవంతం కావాలంటే అక్కడ కచ్చితంగా కంట్రీ ఓవెన్ ప్రొడక్ట్ ఉండాల్సిందేనని కస్టమర్లు చెప్పడం విశేషం.
కరీంనగర్కు చెందిన డాక్టర్ సుధాకర్ రావు పాల్వాని విదేశాల్లో డాక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన భార్య రమాదేవి వివిధ దేశాల ప్రజల ఆహారపు అలవాట్లను జీవనశైలిని అధ్యయనం చేసేవారు. టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నారో తెలుసుకున్నారు. ఆ ట్రెండ్ను ఇండియాలో అప్లికేట్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఇండియా వచ్చాక కంట్రీ ఓవెన్కు శ్రీకారం చుట్టారు. ఈ -కామర్స్ సేవల్ని ఇండియా, అమెరికాలో కలిపి ఇప్పటి వరకు 175 నగరాల్లో అందిస్తున్నారు. అమీర్పేటలోని గ్రీన్పార్క్ హోటల్కు ఎదురుగా కంట్రీఓవెన్ బేకరీ ఉంటుంది. www.countryoven. com లో సంప్రదించొచ్చు.
కస్టమర్ డబ్బులకు విలువ ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం. వారి ప్రతి పైసా వృథా కాకుండా ప్రొడక్ట్స్ నాణ్యతగా ఉంటాయి. 28 ఏండ్లుగా వారికి నచ్చిన రుచులను అందిస్తున్నాం. మా ప్రయాణంలో మా కంట్రీ ఓవెన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుధాకర్ రావు ప్రోత్సాహం మరువలేనిది. మా ఎండీ మేడమ్ ఆలోచనతో ప్రారంభమైన కంట్రీఓవెన్ కస్టమర్ల నమ్మకన్ని నిలబెడుతూ ఆదరణను పొందుతుంది. సిబ్బంది కృషితో మార్కెట్లో నెంబర్వన్గా ఎదగగలిగాం. ఆన్లైన్లో అధికంగా ఆర్డర్స్ వస్తున్నాయి. హరిహర ప్రసాద్ ముల్లపూడి, వైస్ ప్రెసిడెంట్, కంట్రీ ఓవెన్
కేక్ నుంచి స్వీట్ వరకు.. బిస్కెట్ నుంచి బిర్యానీ వరకు.. సలాడ్ నుంచి ఐస్క్రీం వరకు.. ప్రొడక్ట్ ఏదైనా రుచి, హైజీన్లో మాత్రం కంట్రీ ఓవెన్ రాజీ పడదు. దీనికి సాక్ష్యం అమీర్పేటలోని మెయిన్ బ్రాంచీ కార్యకలాపాలే. 1993లో ప్రారంభమైన ఈ బేకరీ నేటి వరకు కస్టమర్ల హృదయాల్లో తన పేరును సుస్థిరం చేసుకుంది. కిచెన్ నుంచి షాపు వరకు ప్రతీది ఓ యూనిక్గా ఉండటం విశేషం. తయారీ నుంచి పార్శిల్ వరకు కస్టమర్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం క్రిస్మస్కు ప్రత్యేకంగా నోరూరించే ప్లమ్కేక్ను తీసుకొచ్చింది. కర్జూరా, చెర్రీస్, బెల్లం, పామ్, గరం మసాల కలయికతో పామ్ కేక్ సిద్ధం చేశారు. 28కి పైగా వెరైటీ కేకులు అందుబాటులో ఉంచారు. రూ.500 నుంచి రూ.1250 వరకు కేకులు ఉన్నాయి.