హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ సీఎండీ పార్ధసారథిని ఈడీ అధికారులు అరెస్టు చేశా రు. కార్వీ క్లయింట్ల షేర్లతో పార్థసారథి భారీగా అవకతవలకు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై గతంలోనే హైదరాబాద్ సీసీఎస్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా పార్థసారథిపై ఈడీ మనీలాండరింగ్ చట్టాల కింద దర్యాప్తు జరుపుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే బెంగళూరు జైలులో ఉన్న పార్థసారథిని ఈ నెల 19న పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చినట్టు సమాచారం. అనంతరం కోర్టులో హాజరుపర్చి చంచల్గూడ జైలుకు తరలించినట్టు తెలిసింది. ఈ నెల 29 వరకు పార్థసారథిని ఈడీ కస్టడీకి ఇచ్చినట్టు తెలిసింది.