స్టేషన్ ఘన్పూర్ : జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని ఇండియన్ బ్యాంక్లో కరోనా కలకలం రేపింది. బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్ తో పాటు మరో ఉద్యోగికి కరోనా సోకడంతో బ్యాంకు సేవలు నలిచిపోయాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది బ్యాంకును శానిటైజ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రోజు మాదిరిగానే గురువారం కూడా వీధుల్లోకి వచ్చిన బ్యాంక్ సిబ్బంది ముందుగా అసిస్టెంట్ మేనేజర్ గౌతమి మల్కాపూర్ పీహెచ్సీలో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగతా సిబ్బంది కూడా పరీక్ష చేయించుకున్నారు.
వీరిలో మేనేజర్, క్యాషియర్ మరో ఉద్యోగికి కూడా కరోనా రావడంతో తో బ్యాంకు సేవలు నిలిపివేశారు. మరో రెండు రోజుల్లో ఖాతాదారులకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు.