న్యూఢిల్లీ: చట్టసభ సభ్యులపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు రాజ్యాంగబద్ధమైనవేనని విజయ్ అన్సారియా, స్నేహా కలితాతో కూడిన అమికస్ క్యూరీ పేర్కొంది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం నివేదికను సమర్పించింది. సిట్టింగ్ లేదా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల కేసులను ప్రత్యేక కోర్టుల్లో విచారించడాన్ని అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా చెప్పలేమని వెల్లడించింది.