అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని నంద్యాల త్రీ టౌన్ పీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామకృష్ణ స్టేషన్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామకృష్ణ ఇటీవల ఆళ్లగడ్డ నుంచి నంద్యాల త్రీటౌన్ పీఎస్కు బదిలీపై వచ్చాడు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా, పని ఒత్తిడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.