‘మనీ’ ‘సిసింద్రీ’ ‘పట్టుకోండి చూద్దాం’వంటి చిత్రాల్లో తనదైన శైలి హాస్యాన్ని పండించి విలక్షణ దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు శివనాగేశ్వరరావు. తాజాగా ఆయన నూతననటీనటులతో ‘దోచేవారెవరురా..’ పేరుతో ఓ కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రత్యేక పాత్రల్లో అజయ్ఘోష్, బిత్తిరి సత్తి కనిపించనున్నారు. ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వర రావు తమ నిర్మాణ సంస్థలో తొలి సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా లోగోను శుక్రవారం ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ఆవిష్కరించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నదని, త్వరలో ఫస్ట్లుక్, టీజర్ను విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.