మహబూబ్నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. శ్రీనివాస్గౌడ్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మహబూబ్నగర్-భూత్పూర్ రోడ్డులోని పాలకొండ వద్ద మంత్రి శ్రీనివాస్గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛంతో శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అబ్రహాం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా శాంతమ్మకు నివాళులర్పించారు.