నిజామాబాద్ సిటీ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విద్యపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారని జలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. ఒకే రోజు రాష్ట్రమంత రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2001లో తాను జిల్లా కలెక్టర్గా పని చేసిన సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, ప్రజాప్రతినిధుల సహకారంతో వేల్పూర్ మండలాన్ని దేశంలోనే మొదటిసారిగా బాల కార్మికులు లేని మండలంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.
మండలంలో 539 మంది బాలకార్మికులను పాఠశాలలో చేర్పించామని, దీనిని సాధించడానికి చాలా కృషి చేశామని, తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై అవగాహన కల్పించడం వల్ల అంగీకరించారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు అశోక్కుమార్ చేసిన సేవలను జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కార్యదర్శి అశోక్కుమార్ను జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, శిక్షణ సహాయ కలెక్టర్ మకరంద్, అప్పటి సీపీవో షేక్మీరా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.