జూబ్లీహిల్స్, జనవరి 22: ప్రజల అత్యవసరాలకు ఏర్పాటు చేసిన మూత్రశాలలు నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారుతున్నాయన్న విమర్శలు ఒకవైపు వినవస్తుండగా.. కనీసం వాటి పరిసరాల్లో పట్టుమని పది సెకండ్లు కూడా నిలబడని దుస్థితి నెలకొంది. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి రహ్మత్నగర్ వెళ్లే దారిలో నిమ్స్మే ప్రహరీని ఆనుకుని ఉన్న ఈ టాయిలెట్ పరిసరాలు ఒకవైపు బురదమయంగా.. మరోవైపు చెత్తకు నిలయంగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. టాయిలెట్లు వాడుకోలేని దుస్థితిలో ఉన్నాయి. ఫలితంగా బురదనీరు దోమలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్మే) రెండో గేట్ త్వరలో ఏర్పాటు కానుండటం విశేషం.