కరోనా వలన సినిమా షూటింగ్స్కు దాదాపు ఎనిమిది నెలలు బ్రేక్ పడడంతో ఇప్పుడు చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తను కమిటైన సినిమాలను పూర్తి చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసే క్రమంలో చిరు ఉండగా, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత లూసిఫర్ రీమేక్ చిత్రంతో పాటు వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ను ఏకకాలంలో చేయనున్నట్టు తెలుస్తుంది.
బాబీ దర్శకత్వంలోను చిరంజీవి సినిమా ఉంటుందని గతంలోనే అఫీషియల్ ప్రకటన రాగా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే దర్శకుడు బాబీ.. సోనాక్షితో చర్చలు జరిపాడని, ఆమె ఇందులో నటించేందుకు ఓకే అనేసిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. . ఒకవేళ సోనాక్షి సిన్హా.. చిరు సినిమాకు ఓకే అంటే రజినీకాంత్తో చేసిన లింగ తర్వాత, ఆమె నటించే రెండో దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది.