న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ లాభాలకు చిప్ల కొరత గండికొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.487 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,420 కోట్లతో పోలిస్తే 66 శాతం తగ్గింది. సెమికండక్టర్ల కొరతతోపాటు కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. లాభాల్లో ఎదురుదెబ్బ తగిలిన సంస్థకు ఆదాయంలో మాత్రం కాస్త ఊరట లభించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ.18,756 కోట్ల నుంచి రూ.20,551 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి తెలి పింది. వాహన విక్రయాలు 3 శాతం తగ్గి 3,79,541 యూనిట్లకు పడిపోయాయి. వీటిలో దేశీయంగా 3,20,133 యూని ట్ల విక్రయాలు జరుపగా.. 59,408 వాహనాలను ఎగుమతి చేసింది.