న్యూఢిల్లీ, ఆగస్టు 7: సరిహద్దుల్లో తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా మరో దుందుడుకు చర్యకు సిద్ధమైంది. టిబెట్, జిన్జియాంగ్ను కలుపుతూ జీ695 పేరిట హైవే నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నది. ఈ నిర్మాణం పూర్తయితే భారత్కు కీలకమైన తూర్పు ఆక్సాయ్ చిన్, పాంగాంగ్ త్సో సరస్సు తదితర ప్రాంతాలు చైనా నిఘా పరిధిలోకి వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1957లో జీ219 హైవే నిర్మాణం తర్వాత అదేస్థాయి రహదారిని చైనా మళ్లీ నిర్మించాలనుకుంటుండటం గమనార్హం.